పశ్చిమగోదావరి జిల్లా,అబ్బిరాజుపాలెం గ్రామంలోని శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానం గోదావరి నది ఒడ్డున కొలువై ఉన్నది.ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు శ్రీదేవి మరియు భూదేవి సమేతంగా భక్తులనుండి పూజలందుకొనుచున్నారు.
ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు శ్రీ త్రిముఖ ఆంజనేయ స్వామివారు.దక్షిణభారతదేశంలో త్రిముఖ (3ముఖములు)ఆంజనేయస్వామి వారి విగ్రహాలు చాలా అరుదుగా మనకు దర్శనమిస్తాయి.
ఆలయ చరిత్ర ప్రకారం పూర్వం అబ్బిరాజుపాలెం గ్రామానికి సమీపంలో దొడ్డిపట్ట అను గ్రామము కలదు. ఆ గ్రామంలో తండూరి మూలస్వామి మరియు సోమరాణి దంపతులకి త్రిమూర్తులవ్రతం చేయుట వల్ల వారికి సంతానం కలిగినది. ఆ బాలునికి త్రిమూర్తులు అని పేరు పెట్టారు. త్రిమూర్తులు బాల్యం నుండి ఆంజనేయ స్వామికి పరమభక్తుడు. ఒకనాడు త్రిమూర్తుల(బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులు) యొక్క అనుగ్రహం వలన ఆ బాలునికి త్రిముఖ ఆంజనేయ స్వామి దర్శనం కలిగినది.
ఆ బాలుడు హనుమంతుడిని ప్రార్ధిస్తూ స్వామివారిని అక్కడే భక్తులందరికి దర్శనం ఇవ్వమని కోరగా స్వామివారు త్రిముఖ ఆంజనేయ స్వామిగా వెలిసెను. ఇక్కడ త్రిముఖ ఆంజనేయ స్వామి స్వయంభువుగా (స్వయంగా భగవంతుడే) వెలిశాడని ప్రతీతి.
ముఖ్యమైన పండుగలు :
స్వామివారి బ్రహ్మోత్సవాలు
హనుమాన్ జయంతి
ముక్కోటి ఏకాదశి
ఆలయ వార్షిక ఉత్సవాలు.
ఆలయ వేళలు
ఉదయం 5 నుండి రాత్రి 9 వరకు .
ఎలా వెళ్ళాలి :
పాలకొల్లు నుండి 15 కి.మీ దూరంలో, భీమవరం నుండి 40 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం.
చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :
అప్పనపల్లి శ్రీ బాలాజీ ఆలయం - 14 (కి.మీ దూరంలో)
పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం - 15
ఆచంట రామలింగేశ్వర స్వామి ఆలయం - 16
అంతర్వేది లక్ష్మి నరసింహ స్వామి - 36
భీమవరం శ్రీ సోమేశ్వర స్వామి - 38
ద్రాక్షారామం భీమేశ్వర స్వామి - 76
0 Comments