శ్రీ సౌమ్యనాథ స్వామి వారి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా నందలూరులో ఉంది . ఈ ఆలయ నిర్మాణం 11 వ శతాబ్దంలో జరిగినట్లు తెలుస్తుంది.
పాండవులు, కాకతీయులు, విజయనగర రాజులూ ఈ ఆలయాన్ని పునర్ఉద్దరించారు. ఈ ఆలయానికి నాలుగు మహాద్వారాలు ఉన్నాయి.ఆలయ పరిసరాలలో ధ్వజస్తంభం, బలిపీఠం, కోనేరు, పెద్ద యాగశాల ఉంది.
శ్రీ సౌమ్యనాథ స్వామి వారు మహాలక్ష్మి అమ్మవారితో కలిసి కొలువై ఉన్నారు.
కొన్ని ప్రతేక్య రోజులలో సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకుతాయి.
ఉదయం 6 నుండి 11 వరకు
సాయంత్రం 4 నుండి రాత్రి 8 వరకు
ముఖ్యమైన పండుగలు :
స్వామివారి బ్రహ్మోత్సవాలు, ముక్కోటి ఏకాదశి.
ఎలా వెళ్ళాలి :
నందలూరు నుండి 1 కి.మీ, కడప నుండి 44 కి.మీ, రాజంపేట 11 నుండి కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం.
చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :
తాళ్ళపాక చెన్నకేశవ స్వామి - 9 (కి.మీ దూరంలో)
ఒంటిమిట్ట కోదండ రామ స్వామి ఆలయం - 19
దేవుని కడప ఆలయం - 43
దేవుని కడప సోమేశ్వర ఆలయం - 47
పుష్పగిరి చెన్నకేశవ స్వామి ఆలయం - 63
రాయచోటి వీరభద్ర స్వామి ఆలయం - 66
బ్రహ్మంగారి మఠం - 105
0 Comments