Ad Code

Responsive Advertisement

శ్రీ వరాహస్వామి - తిరుమల


  • తిరుమలలో  శ్రీస్వామిపుష్కరిణికి వాయువ్యమూలలో తూర్పుముఖంగా శ్రీవరాహస్వామి ఆలయం ఉంది.
  • శ్రీమహావిష్ణువు అదివరాహస్వామిగా అవతరించి భూదేవిని రక్షించి ఇక్కడ నిలిచాడు.అందుకే తిరుమల వరాహక్షేత్రమైనది.
  • తరువాత వేంకటేశ్వర స్వామి వైకుంఠం నుండి వచ్చి, తాను ఉండడానికి శ్రీవరాహస్వామివారిని 100 అడుగుల స్థలాన్ని దానంగా అడిగాడు.
  • ఆ ఒప్పందానికి నియమంగా 'ప్రధమ దర్శనం , ప్రధమ పూజ, ప్రధమ నైవేద్యం వరాహస్వామివారికి, వేంకటేశ్వర స్వామి పత్రం రాసించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది.
  • ఇప్పటికి ఈ నియమం అమలులో ఉంది.
  • వరాహస్వామిని మొదట దర్శిస్తే వేంకటేశ్వర స్వామి సంతోషిస్తాడు.తిరుమల క్షేత్ర సంప్రదాయం కూడా  అదే.
  • వరాహస్వామిని తొలుత దర్శిస్తే భక్తుడు జ్ఞానమయకోశంలోకి ప్రవేశిస్తాడు.
  • శ్రీవరాహస్వామివారికి వైఖానసాగమం ప్రకారం ప్రతిరోజు అర్చనలు, నివేదనలు జరపబడుతున్నాయి. వేంకటేశ్వర స్వామికి అంటే ముందుగానే  శ్రీవరాహస్వామివారికి అన్నప్రసాదాలు నివేదింపబడుతాయి.
  • ప్రతి శుక్రవారం తెల్లవారుజామునే స్వామివారికి అభిషేకం జరుగుతుంది.ప్రతి బ్రహ్మోత్సవం చివరిరోజు శ్రావణ నక్షత్రం రోజున చక్రస్నానం సందర్భంగా శ్రీదేవి,భూదేవి సమేతుడై శ్రీవెంకటేశ్వర స్వామి, చక్రతాళ్వార్ తో కూడా వేంచేస్తాడు, తిరుమంజనం తరువాత వరాహపుష్కరిణిలో స్వామివారికి చక్రస్నానం జరుగుతుంది.
  • రథసప్తమి,ముక్కోటి ద్వాదశినాడు  అభిషేకం జరిపి,పుష్కరిణిలో స్నానం చేయిస్తారు.

Post a Comment

0 Comments