Ad Code

Responsive Advertisement

తిరుమలలో శ్రీరామనవమి ఆస్థానం

 


  • ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమిరోజున బంగారు వాకిలిముందు శ్రీరాములవారికి ఆస్థానం జరుగుతుంది.
  • ఆ రోజు హనుమంత వాహనంపై స్వామివారి ఊరేగింపు జరుగుతుంది.
  • బంగారువాకిలి వద్ద సర్వభూపాల వాహనంలో శ్రీ సీతారామలక్ష్మణులకు, హనుమంతునికి ఆస్థానం నివేదనలు జరుగుతాయి. 
  • శ్రీ రామాయణంలోని శ్రీరామ జన్మవృత్తాంతం పురాణ ప్రవచనం జరుగుతుంది.
  • మంగళ నీరాజనాలతో ఆస్థానం ముగుస్తుంది.


శ్రీరామ పట్టాభిషేకం


  • శ్రీరామనవమి తరువాత రోజు అనగా చైత్ర శుద్ధ దశమిరోజు తిరుమల పురవీధుల్లో శ్రీ సీతారామ లక్ష్మణులకు - అభిముఖంగా మరొక పీఠంపై ఆంజనేయుడు ఊరేగింపబడతాడు.
  • బంగారు వాకిలిముందర శ్రీ సీతారామ లక్ష్మణులకు వీరికి ప్రక్కన ఒక్కొక్క పీఠంపై సుగ్రీవ, అంగద, హనుమంతులకు ఆస్థానం జరుగుతుంది. 
  • నివేదన కార్యక్రమాలు అయిన తర్వాత శ్రీరామజననం నుండి పట్టాభిషేకం వరకు కథను ప్రవచనం చేస్తారు.
  • మంగళ నీరాజనము, పట్టాభిషేకం ఉత్సవం ముగుస్తుంది. 
  • తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది.


Post a Comment

0 Comments