Ad Code

Responsive Advertisement

2022: నవంబరు 9న ఒంగోలులో శ్రీనివాస కల్యాణం

టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నవంబరు 9 వతేదీ శ్రీనివాస కల్యాణం నిర్వహించనున్నారు.  ఒంగోలు శివారులోని క్విస్ ఇంజినీరింగ్ కళాశాల ఎదురుగా గల మైదానంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. 9వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతుంది. తిరుమల నుంచి శ్రీవారు ,అమ్మవార్ల ఉత్సవమూర్తులు ఒంగోలు కల్యాణానికి తీసుకుని వెళతారు. తిరుమల ఆలయం నుంచి ప్రధానార్చకులు శ్రీ అర్చకులు హాజరై స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. 

Post a Comment

0 Comments