Ad Code

Responsive Advertisement

తిరుమల - ఉగాది ఆస్థానం

  • ప్రతి సంవత్సరం ఉగాది పండుగనాడు తిరుమలలో శ్రీవారికి ఉగాది ఆస్థానం జరుగుతుంది. 
  • ఆ రోజు ఉదయం మొదటి గంట నివేదన తరువాత శ్రీ మలయప్ప స్వామివారు దేవేరులతో కూడా సర్వభూపాలవాహనంలో బంగారు వాకిలి ముందు వేంచేస్తారు. 
  • విశ్వక్సేనులవారు పక్కన దక్షిణాభిముఖంగా మరొక పీఠంపై వేంచేస్తారు. 
  • పట్టువస్త్ర సమర్పణ, ప్రసాద నివేదన తరువాత పంచాంగ శ్రవణం జరుగుతుంది. 
  • ఆనాటి తిధి, వార నక్షత్రాలతో పాటు దేశకాల  వ్యవహారాల పంచాంగ వివరాలను శ్రీవారికి వినిపించడం జరుగుతుంది. 
  • కర్పూర నీరాజనాలతో ఆస్థానం ముగుస్తుంది. 

Post a Comment

0 Comments