Ad Code

Responsive Advertisement

అయోధ్య ప్రాముఖ్యత , చరిత్ర || Ayodhya History, Importance


  • అయోధ్య భారతదేశంలోని అతిపురాతన నగరాలలో ఒకటి.అయోధ్య అంటే జయించశక్యం కానిది అని అర్ధం.ఇది ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లాలో సముద్రమట్టానికి 305 అడుగుల ఎత్తులో ఉంటుంది.
  • శ్రీరాముడు ఈ నగరంలోనే జన్మించినట్లు చరిత్ర చెబుతోంది.
  • ప్రతి హిందువు తప్పక చూడాలని కోరుకునే పుణ్యక్షేత్రాలలో అయోధ్య ఒకటి.
  • పూర్వకాలంలో  అయోధ్య నగరం కోసలరాజ్యానికి రాజధానిగా ఉండేది.
  • రామాయణం ప్రకారం  ఈ నగరం 9,000 సంవత్సరాలకు పూర్వం, వేదాలలోమొదటి పురుషుడుగా హిందువులకు ధర్మశాస్త్రం అందించినట్టుగా పేర్కొన్న మనువు చేత స్థాపించబడింది.
  • సూర్యవంశ చక్రవర్తులు పాలించిన కొసలదేశానికి అయోధ్య రాజధాని.
  • స్కంద పురాణంతో పాటు ఇతర పురాణాలు భారతదేశంలోని ఏడు మోక్షాన్ని ఇచ్చే నగరాలలో అయోధ్య ఒకటి అని చెప్తున్నాయి.
  • అధర్వణ వేదం అయోధ్య దేవనిర్మితమని అది స్వర్గసమానమని పేర్కొన్నది.
  • ఈ నగరాన్ని సూర్యవంశ రాజైన వైవసత్వ మనువు కుమారుడైన ఇక్ష్వాకు నిర్మించి పాలించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది.
  • సూర్యవంశంలోని 31వ రాజు హరిశ్చరంద్రుడు ఈ రాజ్యాన్ని పాలించారు. హరిశ్చంద్రుడు సత్యవాక్పరిపాలనకు ప్రసిద్ధి చెందిన వాడు.
  • రఘుమహారాజు రాజ్యావిస్తరణ చేసి  సూర్యంశంలో మరో వంశకర్త అయ్యాడు.
  • రఘుమహారాజు తరువాత సూర్యవంశం రఘువంశంగా కూడా పిలువబడింది. రఘుమహారాజు మనుమడు దశరథుడు. దశరథుడి కుమారుడు రామచంద్రుడు.
  • వాల్మికి రచించిన రామాయణ మాహాకావ్యం మొదటి అధ్యాయాలలో అయోధ్య మహోన్నతంగా వర్ణించబడింది. అంతేకాక కోసల సామ్రాజ్యవైభవం, రాజ్యంలోని ప్రజలు అనుసరిస్తున్న ధర్మం, సంపద, ప్రజల విశ్వసనీయత గురించి గొప్పగా వర్ణించబడింది. 
  • తులసీ దాసు రచించిన రామచరితమానస్‍లో అయోధ్య వైభవం వర్ణించబడింది. 
  • తమిళకవి కంబర్ వ్రాసిన కంబరామాయణంలో కూడా అయోధ్య అత్యున్నతంగా వర్ణించబడింది. 
  • తమిళ వైష్ణవ భక్తులైన ఆళ్వారులు ఈ నగరాన్ని తమ రచనలలో అద్భుతంగా వర్ణించారు. 
  • జడభరత, బహుబలి, సుందరి, పాడలిప్తసురీశ్వరి, హరిచంద్ర, అచలభరత మొదలైనవారు అయోధ్యలో జన్మించిన వారే.


అయోధ్య వివాదం

మొఘల్ వంశానికి ఆద్యుడైన బాబర్ ఇదే స్థలంలో బాబ్రీ మసీదును నిర్మించాడు. దీన్ని ఆయన అంతకు ముందే ఉన్న రామాలయాన్ని కూల్చివేసి కట్టారని కొందరి వాదన. 1992 వ సంవత్సరంలో రామ భక్తులు, దేశం నలుమూలల నుండి తరలివచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లాంటి కొన్ని హిందూ సంస్థల నేతృత్వంలో కూల్చివేయడం జరిగింది. 

ప్రస్తుత స్థలం రామ మందిర నిర్మాణానికి సుప్రీమ్ కోర్ట్ అనుమతిస్తూ తీర్పు ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

Post a Comment

0 Comments