Ad Code

Responsive Advertisement

ఋషిపంచమీ వ్రతం || Rishi Panchami


  • ఈ వ్రతాన్ని భాద్రపద పంచమి రోజున ఆచరిస్తారు.
  • ఈ వ్రతాన్ని చేయడంవల్ల స్త్రీలు ఋతుస్రావ సమయంలో తెలియక చేసిన దోషాలవల్ల కలిగే పాపాలన్ని హరించబడతాయని భవిష్యోత్తర పురాణం చెబుతోంది. 
  • ఈ  రోజున సూర్యోదయం కంటే ముందుగా నదీలో కాని, చెరువులో కానీ, లేదా బావివద్దనో స్నానాన్ని చేయాలి.
  • తరువాత సప్త ఋషులను,వారి పత్నులను పూజించి నానబెట్టిన శనగలు నివేదనగా సమర్పించాలి.
  • ఈ రోజు పడి మొలచిన కూరలను మాత్రమే తినాలి, ఆలా దోరకం కష్టం కనుక కూరలకు దూరంగా ఉండడం మంచిది.
  • స్త్రీలందరూ ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలని చెప్పబడినది.
  • ఈ వ్రతాన్ని ముత్తైదువులతోపాటు వితంతువులు కూడా ఆచరించవచ్చు. 
  • అయితే భర్త జీవించివున్నప్పుడు కనీసం ఒకసారైనా ఈ వ్రతాన్ని ఆచరించి వున్నట్లైతేనే వితంతువులు ఈ వ్రతాన్ని చేయడానికి అర్హులు.

Post a Comment

0 Comments