Ad Code

Responsive Advertisement

శ్రీకృష్ణాష్టమి -- తిరుమల


  • శ్రీకృష్ణాష్టమి రోజు రాత్రి తోమాలసేవ అనంతరం బంగారు వాకిలి వద్ద శ్రీకృష్ణస్వామికి తిరుమంజనం జరుగుతుంది. 
  • అదే సమయంలో మరొక పీఠంపై శ్రీదేవి, భూదేవి సమేత ఉగ్రశ్రీనివాసమూర్తిని వేంచేపు చేసి ద్వాదశ తిరువారాధన చేస్తారు.
  • ఈ అభిషేకాలు ఏకాంతంగా జరుగుతాయి.
  • ఉగ్ర శ్రీనివాసమూర్తి అనందనిలయం లోకి వేంచేపు చెయ్యగా శ్రీకృష్ణస్వామికి ఆస్థానం జరుగుతుంది.
  • శయనించిన బాలకృష్ణుని రూపంలోవున్న స్వామికి నివేదనలు జరుగుతాయి.
  • శ్రీమద్భాగవతంలోని శ్రీకృష్ణావతార ఘట్టం పురాణపఠనం జరుగుతుంది. హారతితో  ఆస్థానం పూర్తి అవుతుంది.
  • తరువాత రోజు తెల్లవారుజామున బాలకృష్ణుని ఊరేగిస్తూ బాలకృష్ణునికి తైల కాపు చేసిన నూనెను భక్తులకు పంచుతారు. భక్తులు ఆ నూనెను తలలకు అంటుకొని మంగళస్నానాలు చేస్తారు.
  • ఆ రోజు మధ్యాహ్నం  శ్రీ మలయప్ప స్వామి తో పాటు మరొక పల్లకిలో శ్రీకృష్ణ భగవానుడు తిరుమల విధులలో ఊరేగుతుండగా ఉట్ల ఉత్సవం జరుగుతుంది.
  • శ్రీవారు ఆలయంలో ప్రవేశించడంతో కృష్ణాష్టమి వేడుకలు ముగుస్తాయి.

Post a Comment

0 Comments