దేశంలో వున్నా రంగనాధ ఆలయాలలో, శ్రీ వెంకటేశ్వర, శ్రీ కృష్ణాలయాలలో, శ్రీ రామాలయాలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి.
అన్నవరం వంటి క్షేత్రాలలో యాదాద్రి, ధర్మపురి, వేదాద్రి, అహోబిలం వంటి లక్ష్మి నరసింహస్వామి ఆలయాలలో వైకుంఠ ద్వారా దర్శనం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
ఏకాదశి గడియలు ప్రారంభం అయిన్పటినుంచి ద్వాదశి తిధి ప్రవేశించే వరకు ఉత్తరద్వారాలు తెరిచి ఉంచుతారు.
వైష్ణవ సంప్రదాయంలో ఉత్తరద్వార దర్శనం మోక్ష ప్రాప్తి కి హేతువు.వైకుంఠ ఏకాదశికి తప్ప సాధ్యం కానీ ఉత్తరద్వార దర్శనంని అనునిత్యం భక్తులకు కల్పిస్తున్న ద్వారకా తిరుమల మోక్ష క్షేత్రం.
త్రేతాయుగంలోద్వారకా మహర్షి చేసిన తపస్సుకు మెచ్చి చీమల పుట్ట నుండి ప్రత్యక్షమైన స్వామి ఈ క్షేత్రంలో దక్షిణాభిముఖంగా వెలిసాడు.
శివాలయాలలో కూడా ఉత్తరద్వార దర్శనం కలిపిస్తారు. వేములవాడ, శ్రీ కాళహస్తి, శ్రీశైలం తదితర ప్రసిద్ధమైన శివాలయాలలో ఉత్తరద్వార దర్శనం నిర్వహిస్తారు.
శివకేశవులకు ఎలాంటి బేధం లేదు అనడానికి ప్రతీకగా శివాలయాలలో కూడా ఉత్తరద్వార దర్శనం కలిపిస్తారు.
0 Comments