- విజయ ఏకాదశి ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వస్తుంది
- ఈ ఏకాదశి గూర్చి స్కంద పురాణంలో వివరించబడింది
- ఈ ఏకాదశి యొక్క ఆచరణ గురించి బ్రహ్మ, నారదుడికి వివరించాడు
- శ్రీ రాముడు ఈ ఏకాదశిని ఆచరించిన తరువాతే సముద్రం దాటి లంకకు వెళ్లి రావణుడిని వధించాడు అని చెబుతారు.
- ఈ రోజు ఏకాదశి వ్రతం ఆచరించిన వారికీ తప్పక విజయం లభిస్తుంది అని చెబుతారు.
- ఈ ఏకాదశి ముందు రోజు రాగి లేదా మట్టికుండలో నీరు నింపి దానిని మామిడాకులతో అలంకరించాలి. తరువాత దాన్ని సప్తధాన్యాలతో అలంకరించిన వేదిక పై ఉంచి దానిపై నారాయణుని నిలపాలి.
- ఏకాదశి రోజు తెల్లవారుజామునే స్నానము చేసి తులసీదళాలు, గంధాన్ని, పూలను, పూలమాలను ధూపదీపాలను, నైవేద్యాన్ని సమర్పించి నారాయణుని పూజించాలి. ఆ రాత్రి జాగరణ చేయాలి.
- బ్రహ్మచర్యం పాటించాలి
- మరునాడు ఆ పాత్రను నదీతీరంలో యధావిధంగా పూజించాలి , తరువాత దానిని బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి.
- ఈ ఏకాదశి మహత్యాన్ని చదివేవాడు, వినేవాడు వాజపేయ యజ్ఞఫలాన్ని పొందుతాడు.
- సాధారణంగా ఏకాదశి రోజు చేయవలసిన నియమాలు ఈరోజు చేస్తారు.
2021 : మార్చి 9.
0 Comments