- మాఘమాసంలో వచ్చే శుద్ధ చతుర్థిని 'తిలచతుర్థి' అంటారు.
- ఈ వ్రతానికి సాయంకాలం చవితి ముఖ్యం.
- ఈ రోజు గణపతిని పూజించాలి.
- నువ్వులతో వండిన పదార్ధాన్ని నివేదించాలి.
- నువ్వులతో హోమం చేయాలి, రాగి పంచపాత్రను నువ్వులతో నింపి బ్రాహ్మణుడికి దానం చేయాలి.
- అతనికి తిలలతో చేసిన పదార్థంతో భోజనం పెట్టాలి.
- నువ్వులతో చేసిన వాటిని స్వయంగా తినాలి.
- ఈ విధంగా అయిదు 'చవితి' లు అంటే ఆషాడ శుద్ధ చవితి వరకు చేయాలి.
- ఆ తరువాత పూజించిన గణపతి మూర్తిని బ్రాహ్మణునికి దానం చేయాలి. దీనినే వరాహపురాణం ' అవిఘ్నకరవ్రతం' అంటోంది.
సగరుడు అశ్వమేధయాగానికి ముందు, శివుడు త్రిపురాసుర సంహారానికి ముందు, శ్రీ మహావిష్ణువు సముద్ర మధనానికి ముందు ఈ వ్రతాన్ని ఆచరించినట్లు తెలుస్తోంది.
0 Comments