- కార్తీక పౌర్ణమి తరువాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని అంటారు.
- ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల పాపాలు తొలగిపోయాయి అని భక్తులు విశ్వసిస్తారు.
- మురాసుర అనే రాక్షసుడిని విష్ణుభగవానుడు చంపిన కారణంగా ఈ ఏకాదశి జరుపుకుంటారు.
- ఈ ఏకాదశి గురించి భవిష్యోత్తర పురాణంలో శ్రీ కృష్ణుడు, ధర్మరాజుకు వివరించాడు.
- ఏకాదశి వ్రతం ఆచరించే వారు ఈ ఏకాదశితోనే మొదలు పెడుతారు.
- ఈ రోజు ఉపవాసం వుంటారు, లేదా సాత్విక ఆహారం భుజిస్తారు.
- బ్రహ్మి ముహూర్తంలో లేచి స్నానం చేసి, విష్ణు దేవాలయాన్ని దర్శిస్తారు.
- ఈ రోజు దానం చేయడం చాల మంచిది.
- ఈ వ్రతం ఆచరించడం వల్ల మోక్షం పొంది వైకుంఠం చేరుతారు అని నమ్ముతారు.
2020 : డిసెంబర్ 11.
0 Comments