దీపావళి పండుగనాడు బంగారు వాకిలిముందు శ్రీ మలయప్పస్వామి వారికి ఆస్థానం జరుగుతుంది
ఆలయంలో యథాక్రమంగా మొదటిఘంట నివేదన పూర్తి అయిన తర్వాత బంగారు వాకిలి ముందు సర్వభూపాలవాహనంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామివారిని వేంచేపు చేస్తారు.
మరొక పీఠంపై విష్వక్సేనులవారిని వేంచేపు చేసిన తర్వాత ఘనంగా నూతనవస్త్ర సమర్పణ, నివేదనలు జరిగిన తర్వాత అక్షతారోపణ చేస్తారు.
చివరగా ఘనంగా హారతులు సమర్పించిన తర్వాత తీర్థచందన, శఠారి వితరణతో దీపావళి ఆస్థానం ముగుస్తుంది
0 Comments