Ad Code

Responsive Advertisement

తిరుమల - వసంతోత్సవాలు

  • ప్రతి సంవత్సరం చైత్ర పూర్ణిమకు ముగిసేట్లుగా మూడురోజులపాటు తిరుమలలో వార్షిక వసంతోత్సవాలు జరుగుతాయి .
  • చైత్రశుద్ధ త్రయోదశి రోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామి ఆలయానికి నైరృతి మూలలో వున్న వసంత మండపానికి వేంచేయగా వసంతోత్సవ అభిషేకాలు నివేదన ఆస్థానాలు జరుగుతాయి . పిదప ఆలయాన్ని చేరుకొంటారు.
  • రెండవ రోజు శ్రీ మలయప్పస్వామికి బంగారు రథోత్సవం జరిగిన తర్వాత మళ్లీ ముందురోజు మాదిరే వసంతమండపంలో వసంతోత్సవం జరుగుతుంది.
  • మూడవరోజు శ్రీ మలయప్పస్వామితోపాటు, వేర్వేరు పల్లకీలలో రుక్మిణీ శ్రీకృష్ణులు, శ్రీ సీతారామలక్ష్మణులు కూడా వసంతమండపానికి ఊరేగింపుగా వెళ్ళి వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని ఆ సాయంత్రం ఆలయానికి చేరుకొంటారు.
  • ఆర్జితంగా జరిగే ఈ వార్షిక వసంతోత్సవాల్లో భక్తులు పాలుపంచుకోవచ్చు. వసంతోత్సవం చేయించిన భక్తులకు తీవ్రమైన రోగాలు తగ్గి, ఆరోగ్యం సిద్ధిస్తుంది.

Post a Comment

0 Comments