ప్రతి సంవత్సరం బ్రహోత్సవాల అనంతరం కార్తికమాసంలో శ్రవణ నక్షత్రం రోజున శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్ప స్వామివారికి "పుష్పయాగం జరుగుతుంది.
క్రీ.శ. 15వ శతాబ్దం నాటికే తిరుమలలో జరుగుతూ అర్ధాంతరంగా నిలిచిపోయిన ఈ పుష్పయాగాన్ని క్రీ.శ. 1980 నవంబరు 14 నుంచి తి.తి.దేవస్థానం పునరుద్ధరించి నిర్వహిస్తున్నది
పుష్పయాగం జరిగే రోజు యథాక్రమంగా రెండు అర్చనలు రెండు నివేదనలు పూర్తి అయిన తర్వాత శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్ప స్వామి కల్యాణమండపానికి వేంచేస్తారు.
హోమాలు, స్నపన తిరుమంజనాదులు నిర్వహిస్తారు.
పిదప ఆ మధ్యాహ్నం శ్రీస్వామివారికి వివిధ రకాలయిన పుష్పాలతో పుష్పార్చన జరుగుతుంది.
ఈ పుష్పాలు శ్రీవారి హృదయం వరకు రాగానే వీటిని తొలగిస్తారు.
మళ్లీ పుష్పార్చన జరుగుతుంది. ఇలా 20 మార్లు జరుగుతుంది.
పిదప ఘనంగా హారతి సమర్పిస్తారు
పుష్పయాగంలో పాల్గొన్న భక్తులకు పూర్వజన్మల వాసనలు తొలగడమేగాక, సర్వరోగాలు నశిస్తాయి. తద్ద్వారా సుఖశాంతులతో ప్రశాంతంగా జీవనం సాగుతుంది.
0 Comments