తిరుమలలో ధనుర్మాసం
- తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామివారికి ఏడాది పొడవునా తెల్లవారు జామున "సుప్రభాతసేవ” జరుగుతుంది.
- కాని ధనుర్మాసంలో ఒక్క నెలపాటు మాత్రం సుప్రభాతానికి బదులుగా “తిరుప్పావై” పఠన జరుగుతుంది
- గోదాదేవి తాను ద్వాపరయుగం నాటి గోపికగా భావించి పాడిన 30 పాశురాలను రోజుకొకటి వంతున గానం చేస్తూ విన్పిస్తారు.
- ఈ సందర్భంలో భోగశ్రీనివాసమూర్తికికాక వెన్నముద్ద కృష్ణునికి ఏకాంతసేవ జరుగుతుంది.
- ఈ తిరుప్పావై పఠన పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.
- ఈ ధనుర్మాసంలో శ్రీవేంకటేశ్వరస్వామి వారి సహస్రనామార్చనలో తులసికి బదులుగా “బిల్వదళాల్ని” ఉపయోగిస్తారు.
0 Comments