ధనుర్మాసంలో శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. వైకుంఠ ఏకాదశి తెల్లవారు జామున తిరుమల వైకుంఠ ద్వారం తెరవబడి, తిరిగి వైకుంఠ ద్వాదశి తెల్లవారుజామున మూసివేయబడుతుంది. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీమలయప్పస్వామి సర్వాభరణ భూషితుడై తిరుమల తిరువీధులలో స్వర్ణరథంలో ఊరేగింపబడిన తర్వాత ఆలయంలో ఆస్థానం జరుగుతుంది.
0 Comments