శ్రీ విద్యా ప్రకాశానంద గిరి స్వాములవారు ప్రబోధించిన నిత్యా సత్యాలు.
- పది కోట్ల ఆస్తికి అధిపతివైనా, ఒక నిముషం ఆయువును కొనలేనని తెలుసుకో
- కోటి కోట్లకు వారుసుడవైనా ఊపిరి పోగానే ఊరి బయట పారేస్తారు
- లక్షాధికారైనా, భిక్షాధికారైనా శ్మశానంలో ఇద్దరూ సమానమే
- వందమంది డాక్టర్లు నీ వెంటవున్నా - నీ పరలోక ప్రయాణం ఆపలేరు
- ప్రపంచానికంతా అధిపతివైనా నీ ఆయుష్షుకు మాత్రం అధిపతివి కావు
- యావత్ ప్రపంచాన్ని జయించగల్గినా - నీ మృత్యువును మాత్రం జయించలేవు
- కాలం విలువైనది- రేపు అనుదానికి రూపులేదు.
- కోట్లు - లక్షలు వున్నాయని మురిసిపోవద్దు. ఆ లక్షలు, కోట్లు నీ వెంట రావు, మృత్యువు నుండి నిన్ను తప్పించలేవు.
- నీవు తిన్నది మట్టిపాలు. ఇతరులకు ఇచ్చినది నీ పాలేనని తెలుసుకో
- నీవు దాచుకున్నది జారిపోతుంది. ఇతరులకు నువ్వు ఇచ్చినది, సహకరించినది నీ ఖాతాలో జమ అవుతుంది.
0 Comments