మహాశివరాత్రి రోజు పూజా చేసే సమయంలో ఏఏ నియమాలను పాటించాలి.
- మహా శివరాత్రి రోజున ప్రాతఃకాలాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకోవాలి.
- ముఖ్యంగా శివుడికి పంచామృతాలు, ఆవు పేడ, ఆవు పంచకం, పాలు, పెరుగు, నెయ్యితో అభిషేకం చేయాలి.
- ఈ అభిషేకాలు చేస్తున్నంతసేపు ఓం నమః శివాయ పంచాక్షరీ మంత్రం ఉచ్చరిస్తూనే ఉండాలి.
- ముందుగా చందన లేపనంతో ప్రారంభించి అన్ని ఉపాచారలాతో శివుడిని పూజించి అగ్నిలో నువ్వులు, బియ్యం, నెయ్యితో కలిపిన అన్నం వేయాలి. ఇలా చేసి పుర్ణాహుతి నిర్వహించాలి.
- శివకథలు వింటూ జాగరణ చేయాలి. అలాగే రథరాత్రి మూడు, నాలుగో జాములో మరోసారి ఆహుతులను సమర్పించాలి.
- తెల్లవారి శివ భక్తులకు అన్న వస్త్రాలు, ఛత్రం ధానం చేయాలి. లింగోద్భవం జరిగిన అర్థరాత్రి రోజూ వస్తుంది కాబట్టి ప్రతిరోజూ శివరాత్రే.
- ఇంటి దగ్గరే శివపార్వతులను పుష్పాలు, బిల్వదళాలు, పంచామృతాలతో అభిషేకం చేయాలి.
- ఉపవాస, జాగరణ శివస్మరణలతో ఉండాలి. ఆ మరుసటి రోజు ఉత్తమ విప్రులు, శివభక్తులకు అన్నదానం చేయాలి.
- సూర్యోదయం వరకూ మౌనవ్రతం చేయదలచినవారు 'ఓం నమః శివాయ' మంత్రాన్ని మనసులో స్మరిస్తూ ఉండాలి.
0 Comments