Ad Code

Responsive Advertisement

ద్వాదశ జ్యోతిర్లింగములు



సౌరాష్ట్రే సోమనాధంచ , శ్రీశైలే మల్లికార్జున మ్ 
ఉజ్జయిన్యాం మహాకాళ , మోంకారే పరమేశ్వరమ్ 
కేదారం హిమవత్ప్సెషే , ఢాకిన్యాం భీమశకరం 
వారణస్యాం చ విశ్యేశం , త్ర్యంబకం గౌతమీతటె 
వైద్యనాధం చితా భూమౌ , నాగేశం దారుకావనే 
సేటుబంధె చ రామేశం , ఝృశ్మేశం చ గుహాలయే

పుణ్యక్షేత్రాలు , పుణ్యతీర్ధలు గల భారత దేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అనే పన్నెండు 
జ్యోతిర్లింగాలు స్వయం ప్రతిష్టితాలు. అనగా వాటికవే ఆవిర్భవించిన మహిమాన్విత 
లింగాలు. అనంతమైన తేజస్సుతో, వేదకాలమునాటికి పూర్వంనుండి భక్తజనాన్ని తరింప 
చేస్తున్న లింగాలే ఈ "ద్వాదశ జ్యోతిర్లింగాలు". 

1. సౌరాష్ర (గుజరాత్) దేశంలో సొమేశ్వరుడు. 

2. ఆంధ్రప్రదేశములోని శ్రీ శైలంలో మల్లికార్జునుడు. 

3. ఉజ్జయినిలో(మద్య ప్రదేశ్) శిప్రా నది తీరాన మహా కాలేశ్వరుదు. 

4. మాలవ్యదేశంలొ(మద్య ప్రదేశ్) నర్మదానది తీరాన ఓంకారేశ్వరుడు. 

5. హిమాలయాల్లో(ఉత్తరాంచల్) మందాకినీ శిఖరాన కేదారేశ్వరుడు. 

6. ఢాకిని నగరాన(మహా రాష్ట్రం) భీమశంకరుడు. 

7. కాశీ క్షేత్రంలో(ఉత్తర ప్రదేశ్) గంగానది తీరాన విశ్వేశ్వరుడు. 

8. సహ్యగిరి శిఖరాలలొ(మహా రాష్ట్రం) నాసికామండలంలో బ్రహ్మగిరిపై గోదావరీ బ్రహ్మ స్థలాన త్రయంబకేశ్వరుడు.

9. ఉత్తర భారతదేశంలో(బీహారు రాష్ట్రం) చితభూమియందు వైద్యనాధుడు.

10. దారుకావనము సమీపంలో(గుజరాత్) గోమతీ నది వద్ద నాగేశ్వరుడు. 

11. సేతుబంధము(తమిళనాడు) వద్ద రామేశ్వరుడు. 

12. ఎల్లోరా గుహలవద్ద(మహా రాష్ట్రం) ఘృశ్శేశ్వరుదు.

Post a Comment

0 Comments