Ad Code

Responsive Advertisement

పూర్వకాలంలో రామాయణ ,మహాభారత జరిగిన ముఖ్య ప్రదేశాలు.

భాగవతం, మహాభారతం


  • నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం – అహోబిలం,ఆంధ్రప్రదేశ్.
  • జమదగ్ని మహర్షి ఆశ్రమం – జమానియా, ఉత్తర్ ప్రదేశ్.
  • మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప్రదేశ్
  • శమంత పంచకం (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు) మరియు దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా
  • పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) – కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర సముద్రతీర ప్రాంతం
  • మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) – పశ్చిమ ఒరిస్సా
  • నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) – గ్వాలియర్ జిల్లా,మధ్యప్రదేశ్
  • వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్
  • నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు బోధించిన ప్రాంతం) – సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
  • వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్
  • ప్రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్.
  • సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)-కురుక్షేత్ర దగ్గర.
  • హస్తినాపురం (కౌరవుల రాజధాని) – హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్.
  • మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్.
  • వ్రేపల్లె / గోకులం – గోకుల్, మధుర దగ్గర.
  • కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) – గ్వాలియర్.
  • మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) – పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్.
  • ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్.
  • గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) – గురుగావ్, హర్యానా.
  • కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం – కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్).
  • పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్.
  • కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం – గిర్నార్, గుజరాత్.
  • శ్రీకృష్ణ, బలరాముల ద్వారకా నగరం – ద్వారక,గుజరాత్.
  • హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) -జలాన్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్.
  • విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) – విదర్భ, మహరాష్ట్ర
  • కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) – కుండినపుర, మహరాష్ట్ర
  • చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) – బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్.
  • కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) – దాతియ జిల్లా, మధ్యప్రదేశ్.
  • ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) – ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర.
  • కుచేలుడు నివసించిన చోటు – పోర్ బందర్, గుజరాత్.
  • పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) – ఎటాహ్, సహజహంపూర్, ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్.
  • కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం) – కంపిల్, ఉత్తర్.
  • జరాసంధుని భీముడు చంపిన చోటు – జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి, బీహార్.
  • కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన ప్రాంతాలు) – పశ్చిమ హర్యానా.
  • మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్,గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం, రాజస్థాన్.
  • విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) – విరాట్ నగర్,రాజస్థాన్
  • శోణపురం (బాణాసురుడి రాజధాని) – సోనిత్ పూర్, అస్సాం.
  • ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) – తేజ్ పూర్, అస్సాం.
  • నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం – ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్.
  • జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం – పర్హాం,ఉత్తర్ ప్రదేశ్.
  • కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)- నేపాల్ లోని తిలార్కోట్.
  • బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్.
  • గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్.

రామాయణం

  • భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం – గంగోత్రి, ఉత్తరాఖండ్
  • కపిల మహర్షి ఆశ్రమం,(శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం.గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది) – గంగాసాగర్, వెస్ట్ బెంగాల్
  • కాంభోజ రాజ్యం – ఇరాన్ ( శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింతవరకూ విస్తరించింది).
  • రక్షస్థలం (రావణుడు తన పది తలలు నరికి శివున్ని పూజించి వరాలు పొందిన చోటు)- లాంగకో, టిబెట్, చైనా
  • పరమశివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చొటు – గోకర్ణ, కర్ణాటక
  • సీతాదేవి భూమిలో లభించిన చోటు – సీతామర్హి, బీహార్
  • మిథిల (సీతాదేవి పుట్టినిల్లు) – జనక్ పూర్, నేపాల్
  • కోసలదేశం – రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం
  • దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన స్థలం – ఫైజాబాద్,ఉత్తర్ ప్రదేశ్.
  • సరయూ నది (ఈ నదీ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది) – ఘాఘర నది.
  • ఆయోధ్య / సాకేతపురం (శ్రీరాముని జన్మస్థలం,బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం,సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలం) – అయోధ్య,ఉత్తర్ ప్రదేశ్.
  • తాటక వధ జరిగిన ప్రదేశం – బక్సర్, బీహార్
  • అహల్య శాపవిమోచన స్థలం – అహిరౌలి,బీహార్
  • కుశనాథపురం (విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం) – సుల్తాన్ పూర్, ఉత్తర్ ప్రదేశ్
  • గుహుడు సీతారామలక్ష్మణులను కలిసిన చోటు – శృంగబేరిపురం, అలహాబాద్ దగ్గర
  • దండకారణ్యం – చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు.
  • చిత్రకూటం (సీతారామలక్ష్మణులు వనవాసం చెసిన చోటు) – సాత్న జిల్లా, మధ్యప్రదేశ్.
  • పంచవటి (శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం) – నాసిక్, మహరాష్ట్ర.
  • కబంధాశ్రమం – కర్దిగుడ్, బెల్గావి, కర్ణాటక.
  • శబరి ఆశ్రమం – సర్బన్, బెల్గావి, కర్ణాటక.
  • హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారి గా కలసిన ప్రదేశం – హనుమాన్ హళ్ళి, కొప్పాళ, కర్ణాటక.
  • ఆంజనేయ పర్వతం (హనుమంతుడి జన్మస్థలం), కిష్కింద (సుగ్రీవుని రాజ్యం), ఋష్యమూక పర్వతం -తుంగభద్ర నదీతీర ప్రాంతం, హంపి దగ్గర,కర్ణాటక
  • విభీషణుడు రాముని శరణు కోరిన స్థలం – ధనుష్కొటి, తమిళనాడు.
  • శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు- రామేశ్వరం,తమిళనాడు
  • రత్నద్వీపం / సింహళం / లంక – శ్రీలంక.
  • అశోకవనం (సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం) – కాండీ దారిలోని సీత ఏళియ, శ్రీలంక
  • శ్రీరాముడు రావణుని వధించిన చోటు – దునువిల్ల, శ్రీలంక
  • సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రాంతం – దివిరుంపోల, శ్రీలంక.
  • వాల్మీకి ఆశ్రమం / సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం / భూదేవిలో ఐక్యమైన స్థలం – ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి 30 మైళ్ళ దూరంలోని బితూర్.
  • కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) – కుశార్, పాకిస్తాన్.
  • లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) – లాహోర్, పాకిస్తాన్
  • తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) – తక్షశిల, పాకిస్తాన్
  • పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) – పెషావర్, పాకిస్తాన్.

Post a Comment

0 Comments