1. గతించిన దానిని స్మరింపకుండుట.
2. ప్రాప్తించిన దానితో సంతృప్తిపడుట.
3. జరగబోయే దానిని గురించి విచారించకుండుట.
॰ కష్టములను సహించలేనప్పుడు - క్రోధము వచ్చును.
॰ ఆహారనియమము గల వారికే క్రోధమును నిగ్రహించే శక్తి కలుగును.
॰ క్రోధము నిగ్రహించినప్పుడే పరమాత్మను మరుపు చేయించునట్టి విఘ్నములు వచ్చినను సులభముగా తొలగిపోవును.
॰ విఘ్నములు తొలగినప్పుడే తపస్సు వృద్ధియగును.
॰ తపస్సు వృద్ధియైనప్పుడే త్రిగుణములు జయించబడి ఆత్మసుఖము స్ధిరపడును.
॰ ప్రకృతి యొక్క గుణములతో కలిసియుండుట వలన జీవుడనబడును.
॰ ప్రకృతి గుణములు దాటినవారు పరమాత్మను చేరగలరు.
------- అదియే జీవన్ముక్తి.
0 Comments