శివాలయంలో స్థూల, భద్ర, సూక్ష్మ ఆమె మూడు లింగాలు ఉంటాయి. భక్తులు మూడు లింగాలను దర్శించాలి.
ఆలయగోపురం, విమానాలను స్థూలాలింగాలుగా భావించాలి.
ధ్వజస్తంభం ముందు ఉండే బలిపీఠమే భద్రలింగం.
గర్భాలయంలో మూలమూర్తి సూక్ష్మ లింగం.
శివాలయంలో ధ్వజస్తంభం వద్ద తప్ప ఇంకా ఎక్కడ సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఆలయ ప్రదక్షిణ చేసిన తరువాత నంది అనుమతితో ఆలయంలో ప్రవేశించాలి. దేవతలు అందరిని దర్శించాక చండీశ్వరుని దర్శించాలి.
శివాలయ దర్శన ఫలితాన్ని ఇచ్చేది చండీశ్వరుడే.
0 Comments