Ad Code

Responsive Advertisement

కార్తీక పూర్ణిమ



కార్తీక మాసం లో శుక్ల పక్ష పూర్ణిమ ని కార్తీక పూర్ణిమ అని అంటారు.

కార్తిక పూర్ణిమకే త్రిపుర పూర్ణిమ అని పేరు. 

ఈ రోజు విష్ణు, శివాలయాలను భక్తులు దర్శించుకుంటారు.

పరమశివుడు త్రిపురాసురులను సంహరించింది ఈ పౌర్ణమినాడే. 

ఈ రోజున ఆలయాలలో ముఖ్యంగా శివాలయాలందు జ్వాలాతోరణోత్సవాన్ని చేస్తారు. త్రిపురాసురులను వధించిన పరమేశునికి దృష్టిదోషం పోయేందుకు, యింకా విజయుడైన అతని గౌరవార్థం పార్వతీదేవి మొదటగా ఈ జ్వాలాతోరణోత్సవాన్ని జరిపించిందట. 

ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా వారణాసిలోని అన్ని ఘాట్లలో దీపాలు వెలిగిస్తారు.

ఈ రోజు శ్రీకృష్ణ భగవాడునుడిని, రాధా దేవిని పూజిస్తారు.

తులసి వివాహం జరపడానికి ఈ రోజు ఆఖరి రోజుగా భావిస్తారు

ఈ రోజు శివాలయాలలో ఏకాదశ రుద్రాభిషేకాలు జరుగుతాయి

దేశ నలుమూలల  ఈ రోజు జాతరలు జరుగుతాయి.


తెల్లవారుజామునే నిద్రలేచి నదిలో స్నానం చేస్తారు. తరువాత ఆలయానికి వెళ్లి భగవంతుండిని దర్శించుకుంటారు.

ఈ రోజు పౌర్ణమి కనుక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిసారు.

శివ లేదా విష్ణు ఆలయంలో 365 వత్తులతో దీపాలు వెలిగిస్తారు.

కార్తీక మరియు ఇతర పురాణాలను చదువుతారు.

ఈ రోజు ఉపవాసం వుంటారు. 

2021 తేదీ : నవంబర్ 18/19

Post a Comment

0 Comments