అనేక ఆశామోహాలతో మనం స్వార్థంతోనే ధనం సంపాదిస్తాం. దోష భూయిష్టమైన ధనాన్ని తనకు ఇవ్వలిసిందిగా భగవంతుని ఆదేశమని పద్మపురాణం చెబుతోంది. నా దోషాలన్నీ తొలగించమంటూ హుండీలో డబ్బు వేస్తాం. కానుకలు, ముడుపులు భగవంతునికి ఇస్తామని అనుకుంటాం కానీ, ఇవన్నీ మనకు ఇచ్చినవాడు ఆయనే అని మర్చిపోతుంటాం. భగవంతుడు మన నుంచి భక్తి భావనను ఆశిస్తాడే తప్ప భౌతికమైన ఈ సంపదలను కాదు అని గ్రహించాలి.
0 Comments