ఈ ఆలయం తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో ఉంది ఈ ఆలయం. ఈ గుడిని ఘంటచోళ మహారాజు కట్టించాడు అని చెబుతారు. ఇక్కడ మూల విరాట్ చెన్నకేశవ స్వామి, వెనుక వైపు జగన్మోహిని రూపం ఉంది.
స్వామి పాదాలచెంత నిత్యం జలం ఊరుతుంది. తీసిన కొద్దీ నీరు వస్తుంటుంది.
ముఖ్యమైన పండుగలు :
చైత్ర శుద్ధ నవమి నుండి పౌర్ణమి వరకు శ్రీ జగన్మోహిని కేశవ స్వామి కల్యాణోత్సవాలు.
వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు సత్యనారాయణ స్వామి కళ్యాణం.
జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు వేణుగోపాలస్వామి కళ్యాణం.
శ్రీ కృష్ణ అష్టమి
క్షీరాబ్ది ద్వాదశి
దసరా నవరాత్రులు
ముక్కోటి ఏకాదశి
భీష్మ ఏకాదశి
ఆలయ వేళలు :
ఉదయం 6.00 నుండి మధ్యాహ్నం 12.00 వరకు
సాయంత్రం 3.00 నుండి రాత్రి 8.00 వరకు
ఎలా వెళ్ళాలి :
రాజమండ్రి నుండి 28 కి.మీ
0 Comments