Ad Code

Responsive Advertisement

శరన్నవరాత్రుల్లో అఖండ దీపం ఏ రోజున వెలిగించాలి ?

  • తొలిరోజునే అఖండ దీపం వెలిగించాలి.
  • ఉదయవేళలోనే  దీపారాధన, కలశస్థాపన చేయాలి. 
  • రాత్రిపూట పూజలు చేసేవారు కూడా తొలిరోజు ఉదయవేళలోనే దీపారాధన, కలశస్థాపన చేయవలసి ఉంటుంది.
  • అఖండ దీపారాధనలో రెండు పెద్ద ప్రమిదలు తీసుకుని ఒకదానిలో ఒకటి ఉంచాలి. అందులో మూడు వత్తులు వేయాలి.
  • దీపాన్ని తూర్పు వైపు వెలిగే విధంగా పెట్టాలి. దీపం తూర్పు వైపు వెలిగితే శాంతి చేకూరుతుంది. ఉత్తరం వైపు ధనధాన్యవృద్ధి కలుగుతుంది. 
  • పడమటివైపు శత్రుపీడ, అనారోగ్యం కలుగుతాయి. దక్షిణం వైపు పెట్టే దీపాన్నియమ దీపం అని పిలుస్తారు. మొత్తంమీద తూర్పు ఉత్తరం దిక్కులలో దీపాన్ని వెలిగేలా ఉంచితే విధాలా మంచిది.
  • దీక్ష కొనసాగినన్ని రోజులూ అఖండదీపం కొండెక్కకుండా చూసుకోవాలి.
  • రాత్రింబవళ్లు దీపాన్ని చూసుకుంటూ ఉండడం కష్టం అనుకునేవారు  అఖండ దీపాన్ని వెలిగించకపోవడం మంచిది. 
  • ప్రతివారూ తప్పనిసరిగా అఖండదీపం వెలిగించాలన్న నియమం లేదు. 
  • ప్రతిసారి పూజా ప్రారంభంలో దీపారాధన చేసినా సరిపోతుంది.


Post a Comment

0 Comments