ఈ నవరాత్రి తొమ్మిది రోజులు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
ఏమి చేయాలి :
- రోజు స్నానం చేసి , ఉతికిన బట్టలు ధరించాలి
- సంకల్పం చెపుకోవాలి
- అమ్మవారికి సంబంధించిన గ్రంధాలు చదవాలి. ఉదా - దేవి భాగవతం
- తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి
- ఈ రోజులులో స్వీయ నియంత్రణ , క్రమశిక్షణ, ఆధ్యాత్మిక జ్ఞానం వైపు అడుగులు వేయాలి .
- ఉదయం పూట ఉపవాసం ఉంది, సూర్యాస్తమయం తరువాత ఆహారం తీసుకోవాలి.
- పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు పండ్లు లేదా పాలు తీసుకోవచ్చు.
- ఈ రోజులలో సాత్విక ఆహారం మాత్రమే స్వీకరించాలి.
- ఈ తొమ్మిది రోజులు వివిధ రూపాలలో అమ్మవారిని పూజించాలి.
ఏమి చేయకూడదు
- తామసిక ఆహారం తీసుకోకూడదు (అల్లం, ఎర్రగడ్డలు)
- పొగ త్రాగడం ,మందు తాగడం లాంటివి చేయకూడదు
- గోళ్లు, జుట్టు కత్తిరించకూడదు
- ఎవరిని నొప్పించవద్దు, మాటలతో బాధపెట్టవద్దు.
0 Comments