బేడీ అంజనేయ స్వామి వారి ఆలయం తిరుమల శ్రీ వారి ఆలయం కి ఎదురుగా ఉంటుంది. ఇది తిరుమల లో ని భూ వరాహ స్వామి, శ్రీ వారి ఆలయం, తరువాత అత్యంత ప్రాచీన ఆలయం.
వరాహ స్వామి వారికీ, శ్రీ వారికీ నైవేద్యం సమర్పించిన తరువాత శ్రీ బేడీ ఆంజనేయ స్వామి వారికీ అదే నైవేద్యం సమర్పిస్తారు. ఇక్కడ స్వామి వారికీ ప్రతి ఆదివారం అభిషేకం నిర్వహిస్తారు, హనుమాన్ జయంతి రోజు ప్రత్యేక పూజలు మరియు అభిషేకాలు చేస్తారు.
పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామి వారు ఒంటె కోసం తిరుమల ని వదిలి వెళ్తుంటే , వాళ్ళ అమ్మ అయిన అంజనా దేవి స్వామి వారి చేతులు కట్టేసింది అని చెప్తారు.ఆమె ఇంకా ఎక్కడికి రాకుండా ఆకాశ గంగ దెగర ఉండిపోవడం వాళ్ళ స్వామి వారు అదే రూపం లో ఇక్కడ నిలిచారు అని చెప్తారు.
ప్రతి రోజు ఉదయం 5.30 నుంచి రాత్రి 9.00 వరకు ఆలయం తెరిచి ఉంటుంది.
0 Comments