Ad Code

Responsive Advertisement

సాయిబాబా ప్రసాదాలయ - షిరిడి.

షిరిడి లో శ్రీ సాయిబాబా వారు జీవించి ఉన్న కాలం నుంచి ఇప్పటి వరకు షిరిడిలో అన్నదానం ఒక యజ్ఞంగా సాగుతోంది.



  • షిరిడి సాయి ప్రసాదం ఎన్నో జన్మల పుణ్యఫలం.
  • 2007 వరకు సాయి ప్రసాదాలయ సాధారణంగానే ఉండేది.భక్తుల రద్దీ పెరగడంతో షిర్డీ సాయి సంస్థాన్ కొత్త ప్రసాదాలయ నిర్మించింది.
  • 7 ఎకరాల భూమిలో 11 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో మహాభవనాన్ని నిర్మించారు.
  • 2001 లో తొలిసారి సౌరశక్తితో మూడువేలమందికి కావాల్సిన భోజనం తాయారు చేసేవారు. 
  • షిరిడి ప్రసాదాలయంలో 73కి  పైగా సౌరశక్తిని ఉత్త్పతి చేసే డిష్ లున్నాయి.ఇవి అన్నీ సూర్యగమనం ఆధారంగా కదులుతూ సౌర్యవిద్యుత్ ఉత్త్పతి చేస్తాయి.
  • ఇలా చేయడం వల్ల సంస్థాన్ కి ఒక సంవత్సరానికి 30 లక్షల వరకు ఆదా అవుతుంది.
  • రోజు 600 నుంచి 800 కిలోల వరకు కూరగాయల్ని ఉడికిస్తారు. అదే పర్వదినాల్లో అయితే ఈ సంఖ్య 1000 నుంచి 1200 కిలోల వరకు ఉంటుంది.
  • రోజుకి 40 నుంచి 50  వేల మందికి సరిపడే చపాతీలు షిరిడి ప్రసాదాలయాలో తయారు అవుతున్నాయి.

  • ఒక గంటకు రెండువేల చపాతీలు ఆధునిక యంత్రాల ద్వారా తయారు చేస్తున్నారు.ఒక రోజుకు 6  నుంచి 7  వేల కిలోల గోధుమ పిండి ఖర్చుఅవుతుంది. గంటకు 30 వేల చపాతీలు చేసే సామర్థ్యం ఈ ప్రసాదాలయంలో వుంది.
  • ఉదయం అయిదు గంటల నుంచే ఇక్కడ పనులు ప్రారంభం అవుతాయి.
  • ప్రసాదాలయంలో భోజనం అత్యంత శుచిగా, శుభ్రంగా ఉంటుంది.
  • ప్రసాదాలయంలో రోజు లక్ష లడ్డులు ప్రసాదం కోసం తయారు చేస్తారు.
  • ప్రసాదాలయంలో వంటలు బాబా చరణాలకు సమర్పించిన తరువాతే భక్తులకు ప్రసాదంగా వడ్డిస్తారు.
  • ఒకే సారి సుమారు నాలుగువేల మంది భోజనం చేసే అవకాశం వుంది.
  • రోజుకు 50 వేలకు పైగా భక్తులు భోజనం స్వీకరిస్తారు.పర్వదినాల్లో అయితే లక్ష వరకు ఉంటుంది.
  • రోజు 300 మంది ఇక్కడ పని చేస్తారు.


సాయిబాబా సమాధి మందిరానికి సుమారు 700 మీటర్ల దూరంలో ప్రసాదాలయం వుంది.

ప్రసాదాలయం వేళలు : ఉదయం 10  నుంచి రాత్రి 10 ,11  వరకు విరామం లేకుండా అన్నప్రసాద వితరణ జరుగుతుంది.   


Post a Comment

0 Comments