మన జాతకంలో దోషాలు నివారణ నిమితం రాహు-కేతు పూజలు చేస్తారు. శివాలయంలో ఈ పూజలు నిర్వహిస్తారు.
రాహు-కేతు గ్రహాలు మన జీవితం మీద దుష్ప్రవభావం చూపడం వల్ల ఆ సమయం లో మనం చేసే పనులకు అనుకున్న ఫలితాలు రావు. చేసే ప్రతి పనికి వ్యతిరేక ఫలితం మనకు ఎదురు అవుతుంది.
గౌరవ మర్యాదలు కోల్పోవడం, ఆర్ధిక సమస్యలు, ఉద్యగా వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు మొదలైన వాటికీ రాహు-కేతు పూజలు నిర్వహిస్తారు.
దేశంలో శ్రీ కాళహస్తి ఆలయం దీనికి ప్రసిద్ధి. కొన్ని వేల మంది ఈ ఆలయం లో
రాహు-కేతు దోష నివారణ కోసం ఈ ఆలయంలో పూజలు చేస్తారు.
ఏ రోజు చేస్తే మంచిది ?
- పూర్ణిమ
- సూర్య గ్రహణం
- చంద్ర గ్రహణం
- చతుర్థి
- పంచమి
- షష్ఠి
ఏ ఏ దేవాలయంలో చేస్తారు ?
- శ్రీ కాళహస్తి ఆలయం - ఆంధ్రప్రదేశ్
- తిరునాగేశ్వరం శివాలయం – తమిళనాడు
- త్రయంబకేశ్వర ఆలయం – నాశిక్
- రామేశ్వరం ఆలయం - తమిళనాడు
- పెదకాకాని ఆలయం – ఆంధ్రప్రదేశ్
- ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయం – జైసింఘ్పుర , ఉజ్జయిని .
- తిరుపంపురం ఆలయం - తమిళనాడు
0 Comments