Ad Code

Responsive Advertisement

షిర్డీ సాయిబాబా వారి ప్రస్థానం





1854 - షిర్డీకి మొదటిసారి బాలయోగిగా వచ్చిన శ్రీసాయి

1857 - షిర్డీ నుండి వెళ్లిపోయిన శ్రీసాయి.

1858 - చాంద్ పాటిల్ పెళ్లి బృందంతో మళ్ళీ షిర్డీ వచ్చిన శ్రీసాయి.

1858 - సాయి అని తొలిసారి పిలిచిన మహల్సాపతి.

1886 - మూడురోజుల పాటు సమాధి స్థితికి వెళ్లి తిరిగి వచ్చిన శ్రీసాయిబాబా.

1896 - షిర్డీలో ఉరుసు ఉత్సవం ప్రారంభం.

1904 - ఊది మహిమ ద్వారా ఒక భక్తురాలుకు సుఖ ప్రసవం.

1908 - తొలిసారి గురుపూర్ణిమ నిర్వహించిన బాబా భక్తులు.

1908 - సాఠె వాడ నిర్మాణం.

1909 - చావడిలో రోజు విడిచి రోజు నిద్ర చేసిన సాయిబాబా.

1910 - బిడ్డను రక్షించేందుకు ధునిలో చెయ్య పెట్టిన సాయిబాబా.

1911 - ద్వారకామాయికి మరమత్తులు చేయించిన భక్తులు.

1912 - శ్రీ రామనవమి ఉత్సవాలు ప్రారంభం.

1912 - గురుస్థాన్ వద్ద శ్రావణపౌర్ణమి రోజు పాదుకలు ప్రతిష్ట.

1915 - సమాధి మందిరం నిర్మాణం ప్రారంభం.

1917 - సాయిసత్చరిత్ర రచనకు హేమాడ్ పంత్ కు సాయి అనుమతి.

1918 - విజయదశమి రోజు బాబా మహానిర్యాణం.బూటీవాడాలో సమాధి.

1921 - షిర్డీసాయి సంస్థాన్ ఏర్పాటు.

1923 - సంస్థాన్ ఆధ్వర్యంలో తొలిసారి సాయిలీల మాసపత్రిక ప్రచురణ.

1929 - సాయిసత్చరిత్ర పూర్తీ.

1950 - సాయి సమాధి మందిర విస్తరణ.

1952 - షిర్డీ ఆలయ గోపురం పై బంగారు కలశ స్థాపన.

1954 -  సమాధి మందిరంలో బాబా పాలరాతి విగ్రహ ప్రతిష్ట.

2007 - షిర్డీ గోపురానికి బంగారు తాపడం , బాబాకు స్వర్ణ సింహాసనం.

2008 - షిర్డీలో గురుపూర్ణిమ శతాబ్ది ఉత్సవాలు.

2018 - షిర్డీలో సాయి సమాధి శతాబ్ది ఉత్సవాలు.


షిర్డీ సాయి ప్రస్థానంలో సాయిబాబా మహా భక్తులు.


1892 - బాబాను తొలిసారి  దర్శించుకున్న నానా సాహెబ్ చాందోర్కర్.

1894 - దాసగణు మహారాజ్ కు తొలిసారి సాయిబాబా దర్శనం.

1907 - షిర్డీ చేరుకున్న భక్తురాలు రాధాకృష్ణమాయి.

1908 - బాబాను తొలిసారి  దర్శించుకున్న మేఘ.

1910 - హేమాడ్ పంత్( సాయి సతచరిత్ర గ్రంధకర్త) కు తొలిసారి సాయి దర్శనం.

1911 - బాబా భక్తురాలు బాయిజాబాయి మరణం.

1916 - రాధాకృష్ణమాయి మరణం.

1917 - బాబాను  దర్శించుకున్న లోకమాన్య బాలగంగాధర్ తిలక్.

1918 - సాయి సమాధి తరువాత 13  రోజులకి నానావళి మరణం.

1922 - పరమభక్తుడు మహల్సాపతి కన్నుమూత.

1929 - హేమాడపంత్ మరణం.

1940 - బాబా ప్రియభక్తుడు శ్యామా కన్నుమూత.

1941 - ఉపాసని మహారాజ్ శివైక్యం.

1945 - తాత్యా పాటిల్ మరణం.

1962 - దాసగణు మహారాజ్ కన్నుమూత.

1965 - తొమ్మిది నాణేలు అందుకున్న లక్ష్మీబాయి షిండే మరణం.





Post a Comment

0 Comments