జ్యోతి స్వరూపుడైన అయ్యప్ప స్వామి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి నాడు మకర జ్యోతి రూపంలో దర్శినమిచ్చి భక్తులకు అపురూపమైన దివ్యానుభూతి ప్రసాదిస్తాడు.
దీనినే మకర విల్లుకు, జ్యోతిదర్శనంగా వ్యవహరిస్తారు.
ఈ జ్యోతి అయ్యప్ప స్వామి కొలువున్న ఆలయానికి ఎదురుగా ఉన్న కాంతిమలై కొండపై దర్శినమిస్తుంది.
మకర సంక్రాంతి సాయంత్రం పందళ రాజ వంశీకులు తెచ్చిన తిరువాభరణాలు స్వామికి అలంకరించిన తరువాతే జ్యోతి దర్శనం ఇస్తుంది.
పూర్వం మహిషి అనే రాక్షసి వధించి తమను రక్షించనందుకు కృతజ్ఞతలతో దేవతలు కాంతిమలై కొండ పై స్వర్ణలయంలో జ్ఞానపీఠం పై అయ్యప్పను కూర్చోబెట్టి నిత్యం పూజలు చేస్తున్నారు.
ఆ విధంగా సంధ్యాసమయంలో పూజ ముగించి దేవతలు ఇచ్చే సంధ్యాహారతే మనకు సంవత్సరానికి ఓ రోజు మకర జ్యోతిగా దర్శనమిస్తుంది అని అంటారు
0 Comments