శ్రీ మహావిష్ణువు శయన భంగిమలో నయన మనోహరంగా కొలువు దీరిన భూలోక వైకుంఠం శ్రీరంగం. 108 దివ్య తిరుపతిల్లో మొదటిగా, ప్రధానమైనదిగా విఖ్యాతి చెందిన క్షేత్రం. శ్రీ రంగనాధుణ్ణి గోదాదేవి వివాహం చేసుకుని ఆయనలో ఐక్యమైంది. వారి వివాహానికి వేదిక నిలిచిన పుణ్యక్షేత్రం శ్రీ రంగం.
కల్యాణ వేళా తిరుమల నుంచి శ్రీరంగానికి పట్టు వస్త్రాలు సారె పంపుతారు.
తిరుమలలో అన్నమాచార్య కళామందిరంలో గోదాకల్యాణం నిర్వహిస్తారు.
వైష్ణవ ఆలయాలు అన్నిటిలోను గోదాకల్యాణాలు వైభవంగా జరుగుతాయి.
108 దివ్యాతిరుపతులలోను మేల్కొట్టే, ట్రిప్లికేన్ పార్ధ సారధి స్వామి ఆలయంలోనూ ,ప్రాచీనమైన నెల్లూరు తల్పగిరి శ్రీ రంగనాధ స్వామి ఆలయం, జడ్చర్ల సమీపంలోని శ్రీరంగపురం ఆలయాలతో పాటు ప్రతి సుప్రసిద్ధ క్షేత్రంలోను గోదా కల్యాణాలు విరివిగా జరుగుతాయి.
0 Comments