శ్రీశైల క్షేత్రంలో పంచాక్షరీ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది.
శ్రీశైల క్షేత్రం ఒక్క భూమండలానికేకాక సర్వ జగత్తుకు గరిమానాభి అని వేదోక్తి.
శ్రీశైల క్షేత్రంలో నలభై నదులు, అరవై కోట్ల తీర్థరాజాలు, పరశురా, భరద్వాజ మహర్షుల తపోవన సీమలు ఉన్నాయి.
చందా కుండ, సూర్య కుండాది పుష్కరిణులు, వృక్ష సంతతలు, అనేక లింగాలు, అద్భుత ఔషదాలు ఉన్నాయి.
బ్రహ్మగిరి, విష్ణుగిరి, రుద్రగిరి అనే మూడు పర్వతాలకు పాదాభివందనం చేస్తూ వేదఘోషను స్ఫురింపచేస్తూ కృష్ణవేణి నది పాతాళ గంగ పేరుతో ఇక్కడ ఉత్తరవాహినిగా ప్రవహిస్తోంది.
అష్ఠాదశ పురాణాలలో, రామాయణ భారతాది, ఇతిహాసాలలో శ్రీశైల వైభవం స్తుతుల్ని అందుకుంది.
కృతయుగంలో హిరణ్యకశిపుడు శ్రీశైలాని తన పూజామందిరంగా చేసుకున్నాడు.
ఈ క్షేత్రంలో సీతారాముల ప్రతిష్టించిన సహస్రలింగాలు, పాండవులు సంస్థాపించిన సద్యోజాత లింగం, పంచపాండవ లింగాలు పూజలు అందుకుంటున్నాయి.
అరవై నాలుగు అధ్యయాలు ఉన్న స్కందపురాణంలోని శ్రీశైల ఖండం, ఈ క్షేత్ర మహిమను వివరిస్తోంది.
ఆదిశంకరులు కొంతకాలం ఇక్కడ తపస్సు చేసి శివానంద లహరిని రచించాడు.
భ్రమరాంబ సన్నిధిలో శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారు.
దత్తావతారమైన నృసింహసరస్వతి స్వామి శ్రీశైల మహత్యాన్ని వివరిస్తూ తన పాదుకలు పట్టుకున్న తంతుడు అనే భక్తుడికి ఈ క్షేత్ర దర్శన భాగ్యాన్ని కలిగించినట్లు గురు చరిత్ర చెబుతోంది.
నృసింహసరస్వతి స్వామి ఇప్పటికి కదళీవనంలో ఉన్నట్లు భక్తులు విశ్వసిస్తారు.
శ్రీశైలంలో పంచ మఠాలు ప్రాచీనమైనవి. అవి ఘంటా మఠం, విభూతి మఠం, రుద్రాక్ష మఠం, సారంగ మఠం, నది మఠం.
0 Comments