- మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రిగా ప్రసిద్ధం.
- పరమశివునికి ప్రధానమైన పర్వదినం ఈ మహాశివరాత్రి.
- ఈ మహాశివరాత్రి విధులలో పగలు ఉపవాసం చేయడం, రాత్రి జాగరణ చేయడం ముఖ్యమైనవి.
- మహాశివరాత్రి రోజు వేకువ జామున నిద్రలేచి,స్నానాదికాలు ముగించి,శివాలయానికి వెళ్లి పరమేశ్వరుని దర్శించాలి.
- అవకాశం ఉంటే నదిలో కానీ, సముద్రంలో కానీ పుణ్య స్నానం చేయడం మంచిది.
- తరువాత శివాలయంలో కానీ, ఇంటి లో కానీ పరమశివుని అభిషేకించి బిల్వదళాలతోను,పలు రకాల పూలతోను అర్చించాలి.
- మహాశివరాత్రి నాటి నాలుగు జాములలో విధి విధానంగా, క్రమపద్ధతిలో శివుని అర్చించాలి అని శాస్త్రవచనం.
- ఆలా వీలుకానప్పుడు ప్రదోష కాలంలో శివునికి అభిషేకం చేయాలి.
- ఈ విధంగా శివుని అర్చించక ఆ రాత్రి అంతా జాగారం చేయాలి. అంటే రాత్రి అంతా నిద్రచకుండా శివప్రార్ధనతో, స్తోత్ర పారాయణలతో, శివగాథలతో, భజనలతో గడపాలి.
- మరుసటి రోజున స్నానాన్ని ఆచరించి, పరమశివుని షాడోపచారాలతో పూజించాలి.
- ఈ శివరాత్రి ఆచరణ వల్ల చెప్పలేనంత శుభా ఫలితాలు లభిస్తాయి.సర్వ పాపాలు హరించబడి, అనంతమైన పుణ్యం లభిస్తుంది.
2021 : మార్చి 11.
0 Comments