Ad Code

Responsive Advertisement

శ్రీ కాలభైరవస్వామి వారి ఆలయం - ఇసన్నపల్లి,కామారెడ్డి.

భక్తుల పాలిట కల్పతరువై, ఆశ్రితుల వ్యాధులను, కష్టాలను పోగొడుతూ భక్త రక్షణే నిత్యకృత్యంగా చేసుకొని వెలసిన అపార కరుణామూర్తి శ్రీ కాలబైరవస్వామి.ఈ కాలభైరవుడు కామారెడ్డి జిల్లా ఇసన్నపల్లి (రామారెడ్డి) గ్రామానికి ఈశాన్య దిక్కులో వెలిశాడు.



క్రీస్తుశకం 1760లో ఈ ప్రాంతాన్ని రాజన్నచౌదరి అనే సంస్థానాధీశుడు భిక్కనూరును రాజధానిగా చేసుకొని రామారెడ్డి, దోమకొండను పరిపాలించినట్టు దోమకొండ చరిత్ర చెబుతున్నది. దోమకొండ అగ్రహారానికి చెందిన రామారెడ్డి, కామారెడ్డి అనే అన్నదమ్ములకు శ్రీ కాళభైరవస్వామి కలలో దర్శనమిచ్చి వారి తో తన విగ్రహం కాశీ క్షేత్రంలో ఉందని, వెంటనే వచ్చి తీసుకెళ్లండని, అది ఎక్కడ కింద పడితే అక్కడ వదిలి దూరం వెళ్లి పొండని చెప్పి అదృశ్యమయ్యాడని పెద్ద లు చెబుతున్నారు. అన్నదమ్ములు ఇద్ద రూ నిద్ర నుంచి మేల్కొని సేవకులను వెంట తీసుకొని ఎడ్లబండ్లపై కాశీ క్షేత్రానికి బయలుదేరి అక్కడ ఉన్న స్వామి వారి దివ్య మంగళ విగ్రహాన్ని అతికష్టం మీద ఎడ్లబండిపై తీసుకువస్తుండగా ఎడ్లబండి ఇసన్నపల్లి (రామారెడ్డి) గ్రామానికి రాగా నే బండికి కట్టిన ఎడ్లు తాళ్లను తెంపుకొని దూరంగా పరిగెత్తాయట. అప్పుడు భూమి కంపించి ఉరుములు, మెరుపులతో వర్షం ప్రారంభం కావడంతో ఎడ్లబండిని అక్కడే నిలిపివేసేలోపే బండి, స్వామి వారి విగ్రహం భూమిలోకి దిగిపోయింది. అప్పటి నుంచి శ్రీ కాళభైరవుడు ఇసన్నపల్లి (రామారెడ్డి) గ్రామాల మధ్య ఈశాన్యంలో కొలువై పూజలు అందుకుంటున్నాడు. విస్సారెడ్డి పేరుతో విసన్నపల్లి గ్రామాన్ని కట్టిచ్చి ఉండవచ్చునని పూర్వీకులు చెపుతున్నారు. విసన్నపల్లి అని అప్పట్లో పిలిచేవారని వృద్ధుల మాట. పూర్వం ఇదే పేరుతో పిలువబడినప్పటికీ ప్రస్తుతం ఈ గ్రామం ఇసన్నపల్లిగా పిలువబడుతున్నది.

శ్రీ కాళభైరవస్వామి జన్మదిన రథోత్సవ ఉత్సవాలు ప్రతీ సంవత్సరం నవంబర్ నెలలో ఘనంగా నిర్వహిస్తారు. వారం రోజుల పాటు ఈ ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేస్తారు. ప్రతీ మంగళవారం స్వామి వారికి ఘనంగా సిందూర పూజలు నిర్వహిస్తారు. స్వామివారిని నాలుగు వారాలు వివిధ రకాల లక్ష పుష్పాలు, స్వీట్లు, కూరగాయలు, పండ్లు, నోట్ల దండలతోపాటు అప్ప డాలతో అలంకరిస్తారు. అనారోగ్యంతో ఉన్న భక్తులు 41 రోజులు పాటు ఆల యం వద్ద ఉండి బావి వద్ద స్నానాలు చేసి ఉదయం, సాయంత్రం రెండు పూటలా స్వామి వారికి జలాభిషేకం చేస్తారు. దీంతో వారు ఆరోగ్యవంతులు అవుతరని అపార నమ్మకం.

ముఖ్యమైన పండుగలు :

ముక్కోటి ఏకాదశి
సామూహిక సత్యనారాయణ వ్రతం
శ్రీ కాలభైరవ స్వామి వ్రతం
కార్తీక బహుళ అష్టమి
మార్గశిర బహుళ అష్టమి


ఆలయ వేళలు :

ఉదయం 05.00 నుండి రాత్రి 09.00 వరకు

మంగళవారం

ఉదయం 06.00 నుండి రాత్రి 08.30 వరకు

మధ్యాహ్నం - 01.00కి సింధూర పూజ.

ప్రతి మంగళవారం అన్నదానం జరుగుతుంది.
వసతి సౌకర్యం అందుబాటులో ఉంది.



కామారెడ్డి నుంచి ఇసన్నపల్లి (రామారెడ్డి) ఆలయానికి 12 కిలోమీటర్ల దూరం.

Post a Comment

0 Comments