ఈ ఆలయం కర్నూలు జిల్లా, బండి ఆత్మకూరు మండలం నల్లమల అడవులకి దగరలో ఉంది. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పురాతన ఆలయాలలో ఒక్కటి.
పురాణాల ప్రకారం చాలామంది మునులు, సప్తఋషులు ఇక్కడ తపస్సు చేసారు. వ్యాస మహర్షి ఈ ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్టించాడు. శ్రీ రాముడు మరియు పంచపాండవులు ఈ ఆలయాన్ని దర్శించారు.
ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది.ప్రతి సోమవారం పంచామృత అభిషేకం జరుగుతుంది.
ఓంకారంలో వెంకటేశ్వర స్వామి, దుర్గాదేవి ఆలయాలు కూడా ఉన్నాయి.
ముఖ్యమైన పండుగలు :
మహాశివరాత్రి
వినాయక చవితి
కార్తీకపౌర్ణమి
దసరా
ఆలయ వేళలు :
ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 వరకు
సాయంత్రం 3 నుండి రాత్రి 8 వరకు.
ఎలా వెళ్ళాలి :
కర్నూలు నుండి 86 కి.మీ దూరంలో
నంద్యాల నుండి 24 కి.మీ దూరంలో
ఆళ్లగడ్డ నుండి 65 కి.మీ దూరంలో
చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :
నంద్యాల శ్రీ జగజ్జనని అమ్మవారి ఆలయం - 25 కి.మీ దూరంలో
గోస్పాడు శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం - 39 కి.మీ దూరంలో
గాజులపల్లి సర్వ లక్ష్మీనరసింహ ఆలయం - 40 కి.మీ దూరంలో.
0 Comments