Ad Code

Responsive Advertisement

వ్యాస భగవానుడు చెప్పిన ధర్మాలు (కుర్మా పురాణం) (1/6)

జీవితంలో ఆచరించాల్సిన ధర్మాలు కుర్మా పురాణంలో వ్యాస మహర్షి వారు చెప్పి వున్నారు. అవి.
  • మానవుడు ఏ ప్రాణినీ హింసించకూడదు
  • ఎప్పుడూ ఎక్కడా అబద్ధం చెప్పకూడదు
  • అహాన్ని అప్రియాన్ని కలిగించే మాటలు చెప్పరాదు
  • ఇతరుల వస్తువులు గడ్డికానీ, కూరలు కానీ, నీళ్ళుగానీ ఏది అపహరించకూడదు. అపహరిస్తే నరకం ప్రాప్తిస్తుంది.
  • ప్రతిరోజూ యాచించకూడదు. ఒకే వ్యక్తిని రెండుసార్లు యాచించకూడదు
  • దేవతలకు సంబంధించిన ద్రవ్యాలని అపహరించకూడదు
  • ఎంత ఆపదవచ్చినా బ్రాహ్మణ ద్రవ్యం అపహరించకూడదు
  • విషం విషం కాదు బ్రాహ్మణుడి సొమ్మే అసలు విషం.
  • పాపాలు చేసి ధర్మం అనే పేరుతో వ్రతాలు నోములు చేయకూడదు
  • ప్రతాలతో, దీక్షలతో తాము చేసిన పాపాల్ని కప్పిపుచ్చి స్త్రీలని శ మోసగించినవాడు, బ్రహ్మజ్ఞులతో నిందించబడతాడు. కపటంతో చేసే వ్రతం ఫలం  సరాసరి రాక్షసులకే చేరుతుంది.
  • దైవ ద్రోహం కన్నా గురుద్రోహం కోటిరెట్లు అధికమైన పాపాల్ని కలిగిస్తుంది.
  • గురు ద్రోహం కన్నా వేదాల్ని నిందించటం, నాస్తికభావాల్ని ప్రచారం చెయ్యటం కోటిరెట్లు అధికపాపాన్నిస్తుంది.
  • పుణ్య నదులు ప్రవహించే చోట విప్రులు నివసించాలి.
  • నదీ తీరం నుంచి ఒక మైలు దూరం లోపే విప్రుడు నివసించాలి.
  • సూతకం ఉన్నవారితో మాట్లాడకూడదు.
  • ఎదుటివారి తమకు చెప్పిన రహస్యాలని బయటపెట్టి వారికీ సంతాపం కలిగించకూడదు.

Post a Comment

0 Comments