Ad Code

Responsive Advertisement

వ్యాస భగవానుడు చెప్పిన ధర్మాలు (కుర్మా పురాణం) (2/6)

జీవితంలో ఆచరించాల్సిన ధర్మాలు కుర్మా పురాణంలో వ్యాస మహర్షి వారు చెప్పి వున్నారు. అవి 


  • రజస్వల స్త్రీతో మాట్లాడకూడదు 
  • దేవతలకు, గురువులకి, విప్రులకి, చేసే దానాన్ని ఆటంకరపచకూడదు.
  • అవసరం లేకుండా ఉదయించే సూర్యుణ్ణిగానీ, చంద్రుణ్ణిగానీ అలాగే అస్తమించే సూర్య-చంద్రుల్నిగానీ, నీళ్ళలో ప్రతిబింబంలా, గ్రహణంలోపట్టి ఉన్నప్పుడు, ఆకాశం మధ్యలో ఉన్నప్పుడు వారిని దర్శించకూడదు.
  • నగ్నంగా ఉన్న స్త్రీనిగాని, పురుషుణ్ణిగానీ చూడకూడదు
  • మలమూత్ర విసర్జన చేస్తున్నవాణ్ణి  చూడకూడదు.
  • మైలతో ఉన్నప్పుడు, సూర్యచంద్ర గ్రహణాలని చూడకూడదు.
  • తుమ్ముతున్నప్పుడు, ఆవులిస్తున్నప్పుడు సుఖాసనం మీద ఉన్నప్పుడు భార్యను చూడకూడదు.
  • నీళ్లు తన ప్రతిబింబాన్ని చూడకూడదు.
  • మూత్రాన్ని దాటకూడదు. మూత్రం మీద కూర్చోకూడదు.
  • గోళ్ళతో నేలమీద రాయకూడదు.
  • ఒక నది దగ్గర మరొక నది గురించి ఒక పర్వతం దగ్గర మరొక పర్వతం గురించి మాట్లాడకూడదు.
  • తన ఇంటికి, తనతో భోజనానికి కలిసి వచ్చేవాడిని విడిచిపెట్టకూడదు
  • నగ్నంగా నీళ్ళలో దిగి స్నానం చేయకూడదు. అగ్నిని దాటకూడదు 
  • తలపై రాయగా మిగిలిన నూనె వంటిమీద రాసుకోకూడదు.
  • సర్పాలతో ఆటలాడరాదు 
  • తన అవయవాలను అకారణంగా తాకరాదు.
  • గుప్తవయవాలను , రోమాలను తాకకూడదు.

Post a Comment

0 Comments