Ad Code

Responsive Advertisement

లక్ష్మి జయంతి



  • ఉత్తర ఫాల్గుణి నక్షత్రంతో కూడిన ఫాల్గుణ పౌర్ణమిని లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజుగా పురాణాలూ చెబుతున్నాయి. 
  • క్షీరసాగర మథనంలో ఫాల్గుణ పౌర్ణమి నాడు లక్ష్మీదేవి ఉద్బవించింది. 
  • ఈ రోజు లక్ష్మి దేవిని పాలతో అభిషేకించి ఆరాధిస్తారు 
  • లక్ష్మి దేవి శ్రీ స్తుతిని ప్రతి రోజు ఉదయం, సాయంత్రం చదువుకుంటే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి, కార్య జయం సిద్ధిస్తుంది.
  • ఈ రోజు ఉపవాసం వుంది, రాత్రి జాగరణ చేస్తారు. 
  • ఈ విధివిధానంగా లక్ష్మి దేవిని పూజించని వారికీ ఆయురారోగ్యాలు, మంచి సంతానం, విశేష ఫలితాలు కలుగుతాయి. 


లక్ష్మీదేవి ఆవిర్భావం


ఒకనాడు దూర్వాస మహర్షికి ఒక అప్సరస పూలమాలతో ఎదురుపడింది. ఆ పూల మాలను తనకు ఇమ్మని మహర్షి అడగగా, అప్పరస ఆ మాలను మహర్షికి ఇచ్చింది. పూల మాలను తీసుకున్న దూర్వాస మహర్షి స్వర్గమునకు వెళ్ళుతుండగా అప్పుడే ఐరావతం పై వస్తున్న ఇంద్రుడు ఎదురయ్యాడు. మహర్షికి నమస్కరించాడు. మహర్షి తన చేతిలోని మాలను ఇంద్రుడికి ఇచ్చాడు. ఇంద్రుడు ఆ మాలను వాసన చూసి ఐరావతం కుంభ స్థలంపై ఉంచాడు. ఐరావతం ఆ మాలను కాండంతో తీసి కిందపడవేసింది. అది చూసి ఇంద్రుని పై అగ్రహించిన దూర్వాసుడు ఈ రోజు నుండి మూడు లోకాలలో లక్ష్మీ కనిపించకుండా పోతుందని శపించాడు.


లక్ష్మి అదృశ్యం కాగానే రాక్షసులు స్వర్గంపై దాడి చేసి ఆక్రమించుకున్నారు రాజ్యం కోల్పోయిన ఇంద్రుడు ఇతర దేవతలతో  కలిసి తిరిగి స్వర్గాన్ని పొందడానికి రాక్షసులతోభీకర పోరాటం చేశారు. ఆ యుద్ధంలో దేవతలు ఓడిపోయారు.అప్పుడు దేవతలందరు కలిసి శ్రీహరిని వేడుకున్నారు. రాక్షసులతో సంధి చేసుకుని వారితో కలిసి క్షీరసాగరం చిలకమని శ్రీహరి సూచించాడు. అప్పుడు సాగరంలో నుండి వచ్చిన అమృతాన్ని సేవిస్తే మరణం ఉండదని చెబుతాడు.


సాగర మథనంలో మొదట వచ్చిన గరళాన్ని శంకరుడు సేవించాడు. అలాగే చంద్రుడు, కామధేనువు, కల్పవృక్షం ఐరావతం, అప్సరసలు, కౌస్తుభమణి వంటివి వచ్చిన పిదప సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి ఉద్భవించింది. ఆ తరువాత వచ్చిన అమృతాన్ని దేవతలకు పంచాడు. ఇదంతా అమృతం కోసమే కాదని దూర్వాసుని శాపం వలన సముద్రంలో దాగి ఉన్న లక్ష్మీదేవిని బయటకు రప్పించడానికి అని పురాణ కధనం. 


2021 : మార్చి 28.

Post a Comment

0 Comments