వామన జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 7వ తేదీన శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో భాష్య పారాయణం జరగనుంది.
శ్రీ శంకరాచార్యులవారి అద్వైతం, శ్రీ రామానుజాచార్యుల వారి విశిష్టాద్వైతం, శ్రీ మధ్వాచార్యుల వారి ద్వైతం, వైఖానస సాంప్రదాయ లక్ష్మీ విశిష్టాద్వైతం భాష్యాలను 12 మంది ఆయా శాస్త్ర పండితులు లోక సంక్షేమం కోసం పారాయణం చేయనున్నారు. ఉపనిషత్ మంత్రాల సమన్వయంతో కూడిన భాష్యాలను పారాయణం చేయడం ద్వారా టిటిడి మంచి సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది.
0 Comments