Ad Code

Responsive Advertisement

కిరదు ఆలయం - రాజస్థాన్



ఈ ఆలయం రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో ఉంది. ఈ ఆలయంలోకి సూర్యాస్తమయం తరువాత భక్తులెవరు ప్రవేశించరు, అక్కడ నిద్ర చేయరు. ఒకవేళ సూర్యాస్తమయం తర్వాత వెళ్ళిన భక్తులు ఆలయం నుంచి బయటకు రాకుండా ఆలయంలోనే రాయిగా మారిపోతారు.


ఈ ఆలయంలో సోమేశ్వర స్వామి ప్రధాన దైవం.


పూర్వ కథనం ప్రకారం ఒక సాధువు తన శిష్యులను తీసుకొని ఈ దేవాలయానికి వచ్చాడు. ఆ సాధువు తన శిష్యులను దేవాలయంలో వదిలి బయటకు వెళ్లి చుట్టూ ఉన్న ప్రాంతాలను చూడసాగాడు. ఆ సాధువు అటు నుంచి అటే రాజ్యంలోని మరికొన్ని ప్రదేశాలను చూడటానికి వెళ్ళాడు.


అసలు తన శిష్యులను ఆలయంలో ఉంచిన సంగతి మర్చిపోయిన సాధువుకు కొన్ని రోజుల తర్వాత శిష్యులు గుర్తుకు రావడంతో తిరిగి ఆలయం చేరుకున్నాడు.


ఆలయం లోపల ఉన్న శిష్యులకు ఆ గ్రామ ప్రజలు ఎవరూ కూడా పిడికెడు అన్నం పెట్టలేదు వారికి సహాయం చేయలేదు వారిపట్ల ఎంతో కఠినంగా ప్రవర్తించడం వల్ల శిష్యులు ఎంతో నీరసించిపోయారు. ఈ విషయం గురించి ఎంతో ఆగ్రహించిన సాధువు రాయి లాంటి మనసు కలిగిన స్థానికులను రాళ్లుగా మారి పొమ్మని సేప్పించాడు. అయితే ఆ ఊరిలో ఓ మహిళ వారికి సహాయం చేయడం వల్ల ఆమె మనిషి గా ఉంటుంది.


కానీ ఆ మహిళను సాధువు సహాయం చేసిన నువ్వు వెనక్కు తిరగకుండా ఇక్కడినుంచి వెళ్లాలని చెబుతాడు. కానీ ఆ మహిళ వెనక్కి తిరిగి చూడటం వల్ల రాయిగా మారుతుంది.


అప్పటి నుంచి ఆ గ్రామంలోని ప్రజలు ఎవరూ కూడా సూర్యాస్తమయం తరువాత ఆలయంలోనికి ప్రవేశించరు. క్రీ.శ.12 వ శతాబ్దంలో కిరడు రాజ్యాన్ని సోమేశ్వర్ అనే రాజు పరిపాలించేవాడు. 

ఆలయ వేళలు 

ఉదయం 8.00 నుండి సాయంత్రం 6.00 వరకు 

జైపూర్ నుండి 566 కి.మి

Post a Comment

0 Comments