వేదమంత్రాల గొప్పతనం
- వేదమంత్రాలను చక్కని ఉచ్ఛారణతో, అర్థయుక్తంగా పఠించాలి. తప్పులు చదువకూడదు. శబ్ద ఉచ్ఛారణ దోషాలు మహాపాపం.
- వేదమంత్రాల శక్తితో పరమాత్మ సంతుష్ఠుడవుతాడు. ఫలితంగా మానవుల కామితార్థాలు నెరవేరుతాయి.
- దివ్యజ్ఞాన పరమార్థం వేదశబ్దాలలోనే ఉంటుంది.
- వేదమంత్రాలను సశాస్త్రీయంగా వినిపించాల్సిన బాధ్యత విద్వాంసులదే.
- ఈ చరాచర సృష్టిలో వేదమంత్రాల నడుమ నిర్వహించే హోమంలో సర్వప్రాణుల ప్రసన్నత కోసం భౌతికాగ్ని యుక్తంగా మంత్రాల శక్తిని వాడతారు.
- ముఖ్యంగా హోమాగ్నికి ఏడు నాలుకలుంటాయి.
- ‘కాలీ’ అనే నాలుక (అగ్నిజ్వాల) తెలుపు రంగును ప్రకాశింపజేస్తుంది.
- ‘కరాలీ’ అనే నాలుక (అగ్నిజ్వాల) అతికఠినమైంది.
- ‘మనోజవా’ అనే నాలుక (అగ్నిజ్వాల) మనోవేగవంతం.
- ‘సులోహితా’ నాలుక (అగ్నిజ్వాల) అగ్నికణాలను విడుదల చేస్తుంది.
- ‘విశ్వరూపి’ అనే జిహ్వ (అగ్నిజ్వాల) అన్ని రంగులనూ కలిగి ఉంటుంది.
- ఈ జిహ్వాగ్ని జ్వాలలనుండి ఉద్భవించే శక్తి తరంగాలు అత్యంత తేజోవంతమైనవి.
- ఈ హోమజ్వాలల ద్వారా మానవుడు విశేష ఫలాలను పొందుతాడు.
0 Comments