ధనుర్మాస విశిష్టత
- ధనుర్మాసానికి ప్రతి ఏడాది అత్యంత విశేష ప్రాధాన్యమిస్తారు.
- ఎందుకంటే దీని పౌరాణిక వైశిష్టం అలాంటిది.
- ఇది దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం వంటిదనీ అంటారు.
- సమస్త విష్ణు ఆలయాలూ, సూర్య దేవాలయాలు ఈ నెల రోజులూ విశేష పూజలతో కళకళలాడుతుంటాయి.
- ప్రత్యేకించి అశేష సంఖ్యలో వైష్ణవ భక్తులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు.
- తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో అయితే ఏకంగా ఈ మాసమన్ని రోజులు ప్రత్యేకించి తిరుప్పావై గానం చేస్తారు.
- భూదేవి అవతారంగా చెప్పే ఆండాళ్ రచించిన దివ్యప్రబంధమే తిరుప్పావై.
- ద్రావిడంలో తిరు అంటే పవ్రితమని, పావై అంటే వ్రతం అని అర్థం.
- ఆయా విష్ణు దేవాలయాలలో ఉదయమే అర్చనతో నివేదనలు చేసి ప్రసాదాలను పిల్లలకు పంచుతారు. దీనినే బాలభోగం అంటారు.
- ఆండాళమ్మ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం వంటి కార్యక్రమాలన్నీ ఈ మాసంలోనే నిర్వహిస్తారు.
- అన్ని రోజులూ ఉదయం, సాయంత్రం దీపారాధనలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుందంటారు.
- ప్రతి రోజూ బ్రాహ్మీ ముహూర్తంలో పారాయణాలు అత్యంత పుణ్యప్రదమనీ అంటారు.
0 Comments