తిరుమల తిరుపతి దేవస్థానం సీనియర్ సిటిజన్స్ కు ప్రత్యేక దర్శనం కల్పిస్తుంది.
- ఈ ప్రత్యేక దర్శనం పొందాలంటే వయస్సు 65 సంవత్సరాలు నిండి ఉండాలి
- ఏదైనా ప్రూఫ్ ఒక్కటి వెంట తీసుకువెళ్లాలి , ఆధార్ కార్డు, పాన్ కార్డు...
- ప్రతి రోజు ఉదయం 10 గంటలకు మధ్యాహ్నం 3 గంటలకు దర్శనంకి అనుమతిస్తారు
- పండుగలు, మరియు ముఖ్యమైన రోజులలో ఈ దర్శనం ఉండదు.
- ఎటువంటి రుసుము అవసరం లేదు. దర్శనం పూర్తిగా ఉచితం.
- తిరుమలలోని "సుపథం" దగ్గర నుండి దర్శనానికి అనుమతిస్తారు.
- దర్శనం సమయం సుమారు 30 నిమిషాల నుండి గంట వరకు పడుతుంది.
- దర్శనంకి వెళ్లే వారితో పాటు ఒక్కరిని అనుమతిస్తారు.
- బుధ, శుక్రవారాలలో ఈ దర్శనం మధ్యాహ్నం మాత్రమే ఉంటుంది
0 Comments