చుట్టూ చిక్కని పచ్చదనం, మధ్యలో కోనేరు, చూడముచ్చటగా ఉంటుంది. జాబాలి అనే మహర్షి ఆశ్రమం ఇక్కడ ఉండేదట. భగవంతుని కోసం ఆయన కఠోర తపస్సు ఆచరించిన పుణ్య ప్రదేశం ఇది. అందుకే ఈ తీర్థం.. జాబాలి తీర్థంగా ప్రసిద్ధిగాంచింది.
ఇక్కడి తీర్థంలో రాముడు స్నానమాచరించాడని అంటారు. ఆ తీర్థాన్నే ‘రామకుండం’గా పిలుస్తున్నారు. ఈ తీర్థ ప్రాశస్త్యం స్కాంద, వరాహ పురాణాల్లోనూ కనిపిస్తుంది.
జాబాలి తీర్థంలో వెలసిన ఆంజనేయుని ఆలయం నిత్యం భక్తజన సందోహంతో కిటకిటలాడుతుంటుంది.
ఇక్కడ ఆంజనేయుడు స్వయంభువుగా వెలిశాడని చెబుతారు.
జాపాలి తీర్థాన్ని ‘ఆనందాశ్రమం’గా కూడా అభివర్ణిస్తారు.
ఇక్కడ స్వామి దర్శన మాత్రం చేత, మానసిక ఆనందం సిద్ధిస్తుందని నమ్మకం.
దుష్ట గ్రహ నివారణకు, ఆరోగ్య సిద్ధికి స్వామిని సేవిస్తారు.
కొందరు భక్తులు ఏడు మంగళవారాలు ఈ ఆలయానికి విచ్చేస్తారు.
108 ప్రదక్షిణలు చేసి వారి మనసులోని కోరికలను, బాధలను స్వామివారికి విన్నవించుకుంటారు.
దశాబ్దాలుగా హాథీరామ్జీ మఠం ఆధ్వర్యంలో ‘జాపాలి ఆంజనేయస్వామి’ ఆలయ నిర్వహణ సాగుతోంది.
0 Comments