ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లా ఆదోని పట్టణంలో ఉంది.ఇక్కడ భవాని అమ్మవారు పార్వతీదేవి రూపంలో కొలువైవున్నారు.
ఆదోని పట్టణంలోని పురాతన ఆలయాలలో ఈ ఆలయం ఒక్కటి. విజయనగర రాజులూ అమ్మవారి ఆలయంలో ప్రతేక్య పూజలు నిర్వహించేవారు. తరువాత మహారాష్ట్ర భక్తులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసారు.
నవరాత్రుల రోజులలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం సందడిగా ఉంటుంది.
ముఖ్యమైన పండుగలు :
మహాశివరాత్రి
కార్తీక మాసం
ఉగాది
ముక్కోటి ఏకాదశి
ఆలయ వేళలు :
ఉదయం 06.00 నుండి మధ్యాహ్నం 01.00 వరకు
సాయంత్రం 03.00 నుండి రాత్రి 09.00 వరకు.
ఎలా వేలాలి :
ఆదోని బస్సు స్టాండ్ నుండి 3 కి.మీ దూరంలో
ఆదోని రైల్వే స్టేషన్ నుండి 2 కి.మీ దూరంలో
కడప విమానాశ్రయం నుండి 220 కి.మీ దూరంలో వుంది ఈ ఆలయం
చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి - 50 కి.మీ
నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయం కసాపురం - 64
హంపి విరూపాక్ష ఆలయం - 110
యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి ఆలయం - 126
మహానంది శ్రీ మహానందీశ్వర స్వామి వారి ఆలయం - 166
0 Comments